ఇకపై అన్నీ హైదరాబాద్ లోనే

Saturday,April 25,2020 - 06:03 by Z_CLU

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ తీస్తున్న సినిమాకు సంబంధించి ముంబయిలో భారీ షెడ్యూల్ జరిగిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా షెడ్యూల్ ను కాస్త ముందుగానే క్లోజ్ చేశారు. కథ ప్రకారం మరోసారి ముంబయిలోనే షెడ్యూల్ చేయాల్సి ఉంది. కానీ పూరి జగన్నాధ్ నో అంటున్నాడు.

మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా కొన్ని నెలల పాటు ముంబయిలో షూటింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నాడట పూరి. ఈ మేరకు తన సినిమా షూటింగ్ మొత్తాన్ని హైదరాబాద్ లోనే పూర్తిచేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

అవసరమైతే రామోజీ ఫిలింసిటీలో కొన్ని సెట్స్ వేసి, ముందస్తు జాగ్రత్తల మధ్య సినిమా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడట. ఈ మేరకు స్క్రీన్ ప్లేలో పూరి కొన్ని మార్పులు కూడా చేసినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ఎత్తేసి, షూటింగ్స్ కు అనుమతి ఇచ్చిన వెంటనే పూరి-విజయ్ సినిమా తిరిగి సెట్స్ పైకి వెళ్తుంది.