మహేష్ సినిమాకు సీక్వెల్?

Thursday,April 23,2020 - 03:52 by Z_CLU

మహేష్ -పూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో మొదటి సినిమాగా తెరకెక్కిన ‘పోకిరి’ ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే తర్వాత వచ్చిన ‘బిజినెస్ మేన్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 2012 లో సంక్రాంతికి థియేటర్స్ లోకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా సినిమాలో మహేష్ చేసిన సూర్య భాయ్ క్యారెక్టర్, పూరి డైలాగ్స్, తమన్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచాయి.

అందుకే ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రెడీ చేసే ఆలోచనలో ఉన్నాడట పూరి. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బయటపెట్టాడు. పూరి దర్శకుడిగా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘బిజినెస్ మేన్’ గురించి చెప్తూ విష్ చేసిన తమన్ అదే ట్వీట్ లో ‘నాకు తెలుసు మీరు బిజినెస్ మెన్ 2’ చేయడానికి రెడీ గా ఉన్నారు. త్వరగా చేయండి సార్” అంటూ పూరిని రిక్వెస్ట్ చేశాడు.

దీంతో బిజినెస్ మేన్ సీక్వెల్ రానుందనే టాక్ సోషల్ మీడియాలో ఊపందుకుంది. మరి నిజంగానే పూరి ‘బిజినెస్ మేన్ 2’ తీస్తాడా ? ఒక వేళ సీక్వెల్ చేస్తే అది మహేష్ తోనే ఉంటుందా ? తెలియాల్సి ఉంది.