మూడోసారి... గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పరశురాం?

Saturday,August 18,2018 - 01:01 by Z_CLU

గీతాఆర్ట్స్ బ్యానర్ పై ఇంతకుముందు శ్రీరస్తు శుభమస్తు సినిమా చేశాడు పరశురాం. అది పెద్ద హిట్. ఆ తర్వాత తిరిగి అదే బ్యానర్ పై గీతగోవిందం సినిమా చేశాడు. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అదే బ్యానర్ పై మరో సినిమా చేయబోతున్నాడు ఈ దర్శకుడు.

మరోసారి మెగా హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు పరశురామ్‌. ఇప్పటికే వరుణ్ తేజ్‌ హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించేందుకు గీతా ఆర్ట్స్‌ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

తన దగ్గర 2 కథలు రెడీగా ఉన్నాయనే విషయాన్ని పరశురాం ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పుడు వాటిలో ఒక స్టోరీతో వరుణ్ తేజ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు ఈ హీరో. త్వరలోనే దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ రాబోతోంది.