గ్రాండ్ గా ఛల్ మోహన్ రంగ ప్రీ-రిలీజ్ ఫంక్షన్

Monday,March 26,2018 - 11:12 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రత్యేక అతిథిగా ఛల్ మోహన్ రంగ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ కూడా కావడంతో ఈవెంట్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు పవన్. ఏప్రిల్ 5న రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాలో నితిన్, మేఘా ఆకాష్ హీరోహీరోయిన్లుగా నటించారు.

నితిన్ మాట్లాడుతూ “25 సినిమాలు.. 16 ఏళ్లు.. ఈ జ‌ర్నీ రోల‌ర్ కోస్ట‌ర్ రైడ్. ఇన్నాళ్లు నాతో సినిమాలు చేసిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఈ సినిమాకు బ్యాక్‌బోన్ కెమెరామేన్ న‌ట్టిగారు. ఆయ‌న‌తో పాటు సాంకేతిక నిపుణులంద‌రికీ ధ‌న్య‌వాదాలు. కృష్ణ‌చైత‌న్య నాకు చాలా ఏళ్లుగా తెలుసు. త‌ను నా ఫ్రెండ్. త‌మ‌న్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు. ఈ సినిమా నెంబ‌ర్ వ‌ల్ల నాకు ముఖ్యం కాదు, ఈ సినిమాను నిర్మించింది ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారు కాబ‌ట్టి ముఖ్యం. అలాగే త్రివిక్ర‌మ్‌గారు.. మా నాన్న‌గారు. నా జీవితంలో నాకు ఇష్ట‌మైన మొద‌టి ముగ్గురూ వీళ్లే. ” అని చెప్పారు.

కృష్ణ‌చైత‌న్య మాట్లాడుతూ “ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారిని, త్రివిక్ర‌మ్‌గారిని చూస్తే చాల‌నుకున్నాను. వాళ్ల‌ని చూడాల‌ని నేను బ‌లంగా కోరుకున్నానేమో. నితిన్ 25వ సినిమాను వీళ్లంద‌రూ క‌లిసి నిర్మించ‌డం చాలా ఆనందంగా ఉంది. త‌మ‌న్‌గారికి 40-50 పాట‌లు రాశాను. ఆయ‌న్ని సాయిగారు అని అంటాం. అద్భుత‌మైన పాట‌లిచ్చారు. ” అని చెప్పారు.

మేఘా ఆకాష్ మాట్లాడుతూ “ఈ చిత్రం యూనిట్ నాకు ఫ్యామిలీ లాంటిది. శేఖ‌ర్ మాస్ట‌ర్ నుంచి ప్ర‌తి ఒక్క‌రినీ గుర్తుచేసుకోవాలి. న‌ట్టిగారికి, త‌మ‌న్ గారికి, నిఖితా రెడ్డి, సుధాక‌ర్‌రెడ్డి, త్రివిక్ర‌మ్‌, ప‌వ‌న్‌గారు, కృష్ణ‌చైత‌న్య‌, నితిన్‌.. అంద‌రికీ చాలా థాంక్స్. అంద‌రికీ మా సినిమా న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది” అని తెలిపారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ “నాకూ, నితిన్‌కీ వ‌య‌సు పెద్ద తేడా ఉన్న‌ప్ప‌టికీ, సినిమాల ప‌రంగా అనుభ‌వం ఐదారేళ్ల తేడానే. నితిన్ వాళ్ల నాన్న‌గారు నాకు ఇష్ట‌మైన వ్య‌క్తి. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు కాక‌ముందు నుంచీ `ఖుషీ`స‌మ‌యం నుంచీ తెలుసు. ఈ సినిమాలో న‌టించిన న‌టీన‌టులంద‌రికీ పేరుపేరునా ధ‌న్య‌వాదాలు. ఈ సినిమా నిర్మాత‌ల్లో నేను ఒక‌డిని అయిన‌ప్ప‌టికీ క్రూ లో చాలా మంది నాకు తెలియ‌దు. అంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా ఒక విష‌యం చెబుతున్నా.. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ” అని అన్నారు.