'రారండోయ్..'తో నిర్మాతగా హ్యాట్రిక్ కొట్టిన కింగ్ నాగార్జున
Friday,June 09,2017 - 06:52 by Z_CLU
‘మనం’ పాటల వేడుకలో నాన్న గారు నటించిన చివరి చిత్రం ‘మనం’ తప్పకుండా ఘనవిజయం సాధించ డమే కాదు చిరకాలం మన మనసుల్లో నిలిచిపోయే గొప్ప సినిమా అవు తుంది’ అని చెప్పారు కింగ్ నాగార్జున. ఆ సినిమా విడుదలై ‘మనం’దరి ఆదరాభిమానాల్ని అందుకుని గొప్ప సూపర్హిట్ చిత్రంగా నిలిచింది. గత సంవత్సరం సంక్రాంతికి ముందు ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఆడియో వేడుకలో ‘సోగ్గాడు’ బంగార్రాజు గెటప్లో స్టేజిపై డ్యాన్స్ చేసి అభిమానుల్ని ఆనంద పర్చడమే కాదు.. అభిమానులందరికీ ‘సంక్రాంతికి వస్తున్నాం.. సూపర్హిట్ కొడుతున్నాం’ అని ఓపెన్గా ఎనౌన్స్ చేసారు. అది చూసి నాగార్జున ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారని కామెంట్ చేసిన వాళ్లు కూడా వున్నారు. కానీ స్టేజి మీద ప్రకటించినట్లుగానే గత సంవత్సరం సంక్రాంతికి ‘సోగ్గాడే’తో బ్లాక్ బస్టర్ కొట్టి హీరోగా, నిర్మాతగా అఖండ విజయం సాధించారు.
మొన్నటికి మొన్న ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుకలో స్టేజి మీద స్టెప్స్ వేసి అక్కినేని అభి మానుల్ని ఉత్సాహపరచడంతో పాటు ‘మళ్లీ వస్తున్నాం.. సూపర్హిట్ కొడుతున్నాం’ అని హర్షధ్వానాల మధ్య మరోసారి ప్రకటించారు. నాగార్జున చెప్పినట్లుగానే 9 రోజుల్లోనే 35 కోట్లు కలెక్ట్ చేసి యువసామ్రాట్ నాగచైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ‘మనం’కి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తే.. ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాలకు కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. నిర్మాతగా ఈ మూడు చిత్రాల ఘన విజయా లతో అన్నపూర్ణ స్టూడి యోస్ యూనిట్ చాలా ఆనందంగా వుంది. ఈ ఘనవిజయం రావ డానికి కింగ్ నాగార్జున తీసుకున్న స్పెషల్ కేర్ కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.