జనవరి నుంచి మహేష్-వంశీ పైడిపల్లి సినిమా

Monday,July 17,2017 - 07:01 by Z_CLU

స్పైడర్ సినిమా షూటింగ్ ను ఫినిషింగ్ స్టేజ్ కు తీసుకొచ్చాడు మహేష్. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఈ రెండు సినిమాలతో పాటు త్వరలో చేయబోయే మరో సినిమాపై కూడా చిన్నపాటి క్లారిటీ ఇచ్చాడు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్. ఈ మూవీని దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం అవుతుందని తాజాగా ప్రకటించాడు నిర్మాత దిల్ రాజు.

మహేష్-వంశీ పైడిపల్లి సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. రైటర్స్ తో కలిసి కూర్చొని డైలాగ్స్ ఫైనలైజ్ చేసే పనిలో వంశీ పైడిపల్లి బిజీగా ఉన్నాడు. అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోంది. కొరటాల దర్శకత్వంలో చేస్తున్న భరత్ అనే నేను సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే వంశీ పైడిపల్లి సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది.