మరో సినిమా ఎనౌన్స్ చేసిన ఇంద్రగంటి

Sunday,January 22,2017 - 04:26 by Z_CLU

వాస్తవానికి నాగచైతన్యతో ఇంద్రగంటి మోహనకృష్ణ నెక్ట్స్ సినిమా ఉంటుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ అంతలోనే మరో ప్రాజెక్టు ఎనౌన్స్ చేశాడు ఈ దర్శకుడు. జెంటిల్ మేన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ డైరక్టర్… అవసరాల శ్రీనివాస్, అడివి శేషు ప్రధాన పాత్రలుగా ఓ డిఫరెంట్ మూవీ చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఇందులో వెన్నెల కిషోర్ కూడా ఓ కీలకపాత్ర పోషించనున్నాడు. 1940ల్లో హాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన స్క్రూబాల్ కామెడీ అనే కాన్సెప్ట్  ఆధారంగా ఈ సినిమా రాబోతోంది.

గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నరసింహారావు నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 1 నుంచి ఉంటుంది. జెంటిల్ మేన్ సినిమాకు సంగీతం అందించిన మణిశర్మ.. ఈ సినిమాకు కూడా మ్యూజిక్ డైరక్టర్ గా సెలక్ట్ అయ్యాడు.