Gopichand - మళ్లీ తెరపైకి ఆరడుగుల బుల్లెట్

Tuesday,July 06,2021 - 11:43 by Z_CLU

Gopichand Aaradugula Bullet August Release
దాదాపు మూడేళ్ల కిందటే రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఆరడుగుల బుల్లెట్. గోపీచంద్, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. మొత్తానికి కిందామీద పడి సినిమాను రెడీ చేశారు. అంతలోనే ఫస్ట్ వేవ్ వచ్చింది.

లాక్ డౌన్ తర్వాత మరోసారి రిలీజ్ కోసం ప్రయత్నించారు. ఈసారి సెకెండ్ వేవ్ వచ్చింది. ఇప్పుడు సెకెండ్ లాక్ డౌన్ కూడా ముగిసింది. దీంతో ఆరడుగుల బుల్లెట్ కోసం కొత్తగా మరో డేట్ ఫిక్స్ చేశారు. ఈసారి ఆగస్ట్ లో రిలీజ్ చేస్తామంటున్నారు మేకర్స్.

Gopichand aaradugula bullet

గోపీచంద్ – న‌య‌న‌తార హీరోహీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టులో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్‌ చేస్తుండటం విశేషం. గోపిచంద్, న‌య‌న‌తార కాంబినేష‌న్‌, బి. గోపాల్ డైరెక్ష‌న్‌, వ‌క్కంతం వంశీ క‌థ‌, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్ అంటున్నారు నిర్మాత.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics