థ్రిల్ చేయబోతున్న గాడ్స్ అఫ్ ధర్మపురి

Saturday,September 28,2019 - 12:01 by Z_CLU

వైవిధ్యమైన వెబ్ సిరీస్ లను అందిస్తూ ప్రేక్షకులను మైమరిపిస్తున జీ 5 యాప్… మరో కొత్త వెబ్ సిరీస్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అక్టోబర్ 23న గాడ్స్ అఫ్ ధర్మపురి అనే డిఫరెంట్ టైటిల్ తో ఒక థ్రిల్లింగ్ యాక్షన్ వెబ్ సిరీస్ ని ZEE5లో టెలికాస్ట్ చేయబోతున్నారు.

ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ లాంచ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ని ఏళ్ళనార్ ఫిలిమ్స్ పతకం పై లక్ష్మి లావు నిర్మించారు. సత్య దేవ్, రాజ్ శెట్టి, శృతి ముఖ్య పాత్రలుగా నటించారు.

పలు సినిమాల్లో నటించి, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అనీష్ కురువిళ్ల ఈ వెబ్ సిరీస్ ను డైరక్ట్ చేశాడు. ఎవరూ ఊహించని విధంగా ఈ వెబ్ సిరీస్ సాగుతుందని, ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ఉంటుందని అంటున్నాడు అనీష్.