అంతా రెడీ.. క్రేజీ కాంబో వస్తోంది !

Wednesday,May 20,2020 - 01:55 by Z_CLU

ప్రస్తుతం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబో పై క్లారిటీ వచ్చింది. KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ కాంబోలో సినిమా నిర్మించబోతునట్లు అప్పట్లో మైత్రి నిర్మాతలు ప్రకటించారు. అలా ప్రకటించిన రోజు నుండి ఈ కాంబో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. తాజాగా తమ కాంబినేషన్ సినిమాపై హింట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్.

ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసాడు ప్రశాంత్. ట్వీట్ లో తారక్ ను అణుబాంబుతో పోలుస్తూ దాని పక్కన కూర్చోబోతున్నా అంటూ తెలిపాడు. దీంతో ఈ పవర్ ఫుల్ కాంబినేషన్ సినిమాపై ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేసింది.

త్రివిక్రమ్ సినిమా తర్వాత తారక్ , ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. మరి KGF డైరెక్టర్ తారక్ ను ఎలాంటి పవర్ ఫుల్ రోల్ లో చూపిస్తాడో చూడాలి.