డైరెక్షన్ కి నో చెప్పిన చిరు !

Tuesday,September 24,2019 - 10:00 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ ‘సైరా నరసింహ రెడ్డి’ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసారు. అయితే ఈవెంట్ లో సినిమా సెట్స్ పైకి రాకముందు జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటికొచ్చింది. కథ సిద్దమయ్యాక పరుచూరి బ్రదర్స్ నటనతో పాటు దర్శకత్వం కూడా చేయాలని మెగా స్టార్ ని అడిగారట.

దానికి చిరు చిరునవ్వుతో డైరెక్షన్ అనేది ఈజీ జాబ్ కాదు. రెండు భాద్యతలు నా వల్ల కాదు రెండిటిలో ఏది చేయమంటారని అడిగాడట. దానికి వెంటనే ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి గా మిమ్మల్నే ఊహించుకున్నాం. ఈ పాత్రను మీరే చేయాలి. సినిమాకు మరో దర్శకుడిని చూద్దాం అన్నారట. ఈ విషయాన్ని వేదికపై చిరు స్వయంగా చెప్పుకున్నాడు. అంతే కాదు మెగా స్టార్ కి ఓ ఇరవై ఏళ్ల క్రితం స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ చరిత్రతో సినిమా చేయాలని ఉండేదట. కానీ ఎవరూ చిరు దగ్గరికి అలాంటి కథను తీసుకెళ్లలేదట. అయితే భగత్ సింగ్ కథతో సినిమా చేయలేకపోయినా ఇప్పుడు మొదటి స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి చరిత్రతో సినిమా చేస్తున్నదుకు సంతోషంగా ఉందని ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ తెలిపాడు చిరు.