ఆ సినిమా ఆగిపోవడానికి రీజన్ చెప్పిన బాలయ్య

Sunday,June 07,2020 - 01:23 by Z_CLU

 

మొన్నీ మధ్య బాలకృష్ణ తో దర్శకుడు కృష్ణవంశీ ‘రైతు’ అనే సినిమా చేయబోతున్నాడంటూ టాక్ వచ్చింది. కట్ చేస్తే ఆ సినిమా అనౌన్స్ మెంట్ వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. అయితే తాజాగా ఆ సినిమా ఆగిపోవడానికి రీజన్ చెప్పాడు బాలకృష్ణ.

‘రైతు’ బ్రహ్మాండమైన కథ అని, కానీ అమితాబ్ గారిని ఒక స్పెషల్ రోల్ కోసం సంప్రదిస్తే ఆయన చేయనన్నారని అందుకే ఆ సినిమాను పక్కన పెట్టానని ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకున్నాడు బాలయ్య.

ఇక నాన్నగారు చేసిన సినిమాల్లో ‘నర్తనశాల’ సినిమాకు సీక్వెల్ చేయలనుకున్నాను కానీ అట్టహాసంగా ప్రారంభమైన ఆ సినిమా సౌందర్య మరణంతో ఆగిపోయిందని అన్నారు. కొన్నిసార్లు క్యాస్టింగ్ విషయంలో పక్కాగా ఉండాలని ఏమాత్రం మిస్ ఫెయిర్ అయినా నిర్మాత భారీగా నష్టపోతాడని తెలిపారు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో మరోసారి తన డ్రీం రోల్స్ గురించి చెప్పుకున్నాడు. చంఘిజ్ ఖాన్ పాత్రతో పాటు గోనగన్నారెడ్డి క్యారెక్టర్ చేయాలనుందని అవి నా డ్రీం రోల్స్ అని మళ్ళీ గుర్తుచేశారు నందమూరి నటసింహం.