సాహో యూనిట్ లోకి మరో ఇద్దరు నటులు

Tuesday,May 15,2018 - 12:03 by Z_CLU

ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో సాహో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అబుదాబిలో ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. కేవలం ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసమే 90 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తోంది యూవీ క్రియేషన్స్ బ్యానర్. ఇప్పుడీ షెడ్యూల్ లోకి మరో ఇద్దరు నటులు యాడ్ అయ్యారు.

సాహోలో విలన్ గా నటిస్తున్న అరుణ్ విజయ్.. ఇవాళ్టి నుంచి అబుదాటి షెడ్యూల్ లో జాయిన్ అయ్యాడు. ఇలా అబుదాబి వెళ్లాడో లేదే వెంటనే షూటింగ్ లొకేషన్స్ స్టిల్స్ ను సోషల్ మీడియాలో అప్ డేట్ చేశాడు అరుణ్ విజయ్. ఇతడితో పాటు మరో నటుడు మురళి శర్మ కూడా అబుదాబి చేరుకున్నాడు.
యాక్షన్ ఎపిసోడ్ కు, మురళీ శర్మకు కనెక్షన్ ఏంటనేది తెలియాల్సిం ఉంది. అటు హీరోయిన్ శ్రద్ధకపూర్ మాత్రం యాక్షన్ ఎపిసోడ్ లో చురుగ్గా పాల్గొంటోంది. సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేసిన కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ బ్లాక్ తీస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత దుబాయ్, అట్నుంచి అటు రొమేనియా షెడ్యూల్స్ కొనసాగుతాయి.