అదాశర్మ హీరోయిన్ గా తెలుగు సినిమా

Monday,July 27,2020 - 03:16 by Z_CLU

శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై అదా శర్మ, సంజయ్, భాను శ్రీ, అభయ్, హరి తేజ, అక్షిత శ్రీనివాస్ మరియు అజయ్ ముఖ్య తారాగణంతో విప్రా దర్శకత్వంలో గౌరీ కృష్ణ నిర్మాతగా సినిమా రాబోతోంది. ఈ మూవీ ఈరోజు లాంఛనంగా లాంఛ్ అయింది.

ఇదొక మిస్టరీ థ్రిల్లర్. సినిమా కథ మొత్తం అదా శర్మ చుట్టూ తిరుగుతుంది. ఈరోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈరోజు నుంచి 10 రోజులు పాటు హైదరాబాద్ లో షూటింగ్, తర్వాత నిర్మల్ లో రెండో షెడ్యూల్ ప్రారంభమౌతుంది.

ఇంతకుముందు తను నటించిన హార్ట్ ఎటాక్, క్షణం సినిమాల తర్వాత మరో మంచి పాత్ర చేస్తున్నానని చెబుతోంది అదా శర్మ.