తొలిసారి మళయాళ సినిమాలో త్రిష

Friday,February 02,2018 - 12:03 by Z_CLU

సౌత్ ఇండియన్ సినిమాల్లో తన సొంతమార్క్ క్రియేట్ చేసుకున్న త్రిష మలయాళం లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. శ్యామ్ ప్రసాద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘హే జ్యూడ్’ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. నివిన్ పాల్ హీరోగా నటించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది.

తెలుగు తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన త్రిష, “మళయాళ సినిమాలు రియాలిటీకి మరీ దగ్గరగా ఉంటాయన్న రీజన్ తో ఇన్నాళ్ళు అవాయిడ్ చేసినా, ఈ సినిమా స్టోరీలైన్ నచ్చడంతో నో అని చెప్పలేకపోయాను” అని చెప్పుకుంది త్రిష.

 

ఈ సినిమాలో సింగర్ లా నటించిన త్రిష ఈ సినిమాతో మలయాళం లోను క్రేజ్ క్రియేట్ అవ్వడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది. మ్యాగ్జిమం షూటింగ్ గోవాలో జరుపుకున్న ఈ సినిమాకి అనిల్ కుమార్ నిర్మాత.