సూపర్ స్టార్ పవర్: 2వేల ప్రీమియర్ షోలు

Saturday,April 07,2018 - 10:22 by Z_CLU

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తున్న చిత్రం “భరత్ అనే నేను”. ఏప్రిల్ 20 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ సినిమా. అంతకంటే ఒక రోజు ముందు ఈ సినిమా ప్రీమియర్స్ కు భారీ ఏర్పాట్లు చేశారు. ఓవర్సీస్ లో ఈ మూవీ కోసం ఏకంగా 2వేల ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 250 లొకేషన్లలో ఈ సినిమా ప్రీమియర్స్ ప్లాన్ చేశారు.

ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా భారీ స్థాయి లో రిలీజ్ అవుతుంది. మహేష్ బాబు తొలిసారి ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా లో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈరోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరబాద్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నాడు. ఎల్బీ స్టేడియంలో ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేశారు.