Pooja hegde gives clarity on issue with Prabhas !

Wednesday,March 09,2022 - 05:31 by Z_CLU

'రాధేశ్యామ్' షూటింగ్ లో ప్రభాస్ కి, పూజకి మధ్యలో ఏదో గొడవ జరిగిందంటూ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టింది.  అందుకే ప్రమోషన్స్ లో కూడా వీరిద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారని సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది పూజా హెగ్డే.

తమ మధ్య ఎలాంటి గొడవ జరగలేదని , ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్ అంటూ చెప్పుకుంది. షూటింగ్ లో నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు.  నాతో పాటు మా అమ్మకి కూడా ప్రభాస్ ఇంటి నుండి భోజనం వచ్చేది. ఇక తమ ఇద్దరికీ మధ్య ఏదో గొడవ ఉందంటూ వస్తున్న వార్తలను పూజ ఖండిస్తూ అలాంటిదేం లేదని ప్రభాస్ తో మాట్లాడకుండా ఎవరు ఉండగలరు చెప్పండి అంటూ చెప్పుకుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజా ఈ విషయంపై స్పందించి మాట్లాడటడంతో ఈ న్యూస్ కి ఫులిస్టాప్ పడింది.  ప్రభాస్ తో పూజ హెగ్డే కి గొడవ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకి పూజ రెస్పాన్స్ తో క్లారిటీ వచ్చేసింది.  రాధాకృష్ణ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పిరియాడిక్ లవ్ స్టోరీ 'రాధేశ్యామ్' మార్చ్ 11 న గ్రాండ్ గా రిలీజవుతుంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics