తేజ దర్శకత్వంలో వెంకీ.. ఆల్ మోస్ట్ ఫిక్స్

Thursday,October 19,2017 - 05:34 by Z_CLU

గురు తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకటేశ్.. ఎట్టకేలకు తేజ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనీల్ సుంకర, సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. వచ్చేనెల రెండో వారంలో సినిమా లాంఛనంగా ప్రారంభమౌతుంది. ఈ వివరాలతో త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది.

బాలయ్య హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని తేజ ఇదివరకే ప్రకటించాడు. అయితే ఆ ప్రాజెక్ట్ కంటే ముందే వెంకీతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే వెంకీకి స్టోరీలైన్ వినిపించిన తేజ, అతడి నుంచి ఆమోదం పొందాడు. ఈ సినిమాలో కాలేజీ ప్రొఫెసర్ గా కనిపించబోతున్నాడు వెంకటేశ్.

నిజానికి గురు తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేశాడు వెంకటేశ్. అది వర్కవుట్ కాకపోవడంతో పూరి జగన్నాధ్, క్రిష్ లాంటి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్ గా వెంకీతో మూవీ చేసే ఛాన్స్ తేజకు దక్కింది. రానాతో నేనే రాజు నేనే మంత్రి సినిమా తీసిన తేజ.. మరోసారి అదే కాంపౌండ్ లో సినిమా చేయబోతున్నాడన్నమాట. ఈ ప్రాజెక్టులో మెహ్రీన్ ను హీరోయిన్ గా తీసుకునే అవకాశముంది.