Venkatesh: మొన్న సారీ.. ఈసారి థ్యాంక్స్
Saturday,July 31,2021 - 02:13 by Z_CLU
నారప్ప సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు దగ్గుబాటి ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. దీనిపై హీరో వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు అభిమానులకు సారీ చెప్పారు. అలా ఓటీటీలో డైరక్ట్ గా రిలీజైన నారప్ప సినిమా అందరి ఆదరణ పొందిందంటున్నాడు వెంకీ. ఈ సందర్భంగా అభిమానులకు థ్యాంక్స్ చెబుతున్నాడు.
“నారప్ప క్యారెక్టర్ను చాలెంజింగ్గా తీసుకున్నాను. ఈ చాలెంజ్లో నేను సక్సెస్ కావడానికి మా టీమ్ నాలో నింపిన ఎనర్జీ కూడా కారణం. షూటింగ్ సమయంలో ‘నారప్ప’ క్యారెక్టర్లో చాలా కాలం ఉండిపోయాను. ‘నారప్ప’ మంచి ఎక్స్పీరియన్స్. నారప్ప సినిమాలోని ‘రా..నరకరా’ పాట లిరిక్ను అనంతశ్రీరామ్ బాగా రాశారు. ఈ లిరిక్ వినప్పుడు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామా? అనిపించింది. ముఖ్యంగా నా అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నాను. నారప్ప ఓటీటీలో వచ్చినప్పటికీ వారు ఆదరించారు. ఫ్యామిలీస్తో కలిసి నారప్ప సినిమా చూస్తున్నారు. ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. వారికి థ్యాంక్స్.”
ఇలా ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పాడు వెంకీ. ఫ్యాన్స్ తో పాటు నారప్ప సినిమాను పెద్ద సక్సెస్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ సందర్భంగా నారప్ప సినిమా ఎక్స్ పీరియన్స్ ను మరోసారి పంచుకున్నాడు.
“నా కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను. మరెన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేశాను. కానీ ‘అసురన్’ చిత్రం నాకు డిఫరెంట్గా అనిపించి, ‘నారప్ప’ చేయాలని వెంటనే ఒప్పుకున్నాను. ‘అసురన్’లాంటి ఓ సినిమాను ఇచ్చిన దర్శకుడు వెట్రీమారన్, యాక్టర్ ధనుష్, నిర్మాత థానుగారికి థ్యాంక్స్. ‘అసురన్’ లేకపోతే నారప్ప ఉండేది కాదు. తెలుగు ఆడియన్స్కు నారప్ప కొత్తగా అనిపిస్తుంది.”
త్వరలోనే ఎఫ్3 సినిమాతో కలుస్తానంటున్నాడు వెంకీ. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా మరోసారి అందర్నీ నవ్విస్తుందంటున్నాడు వెంకటేష్.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics