Karthikeya 2 ప్రమోషనల్ టూర్స్ తో టీం బిజీ

Tuesday,August 09,2022 - 04:44 by Z_CLU

Nikhil Siddharth’s ‘Karthikeya 2’ Promotions are full swing

నిఖిల్ సిద్దార్థ్ హీరోగా చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘కార్తికేయ 2’ ఆగస్ట్ 13న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం టీం అంతా టూర్స్ తిరుగుతూ సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. నిఖిల్ తో పాటు అనుపమ , శ్రీనివాస్ రెడ్డి , వైవా హర్ష వైజాగ్ , విజయవాడ వెళ్ళారు. వైజాగ్ లో సంగం శరత్ లో  ఈవెంట్ ఏర్పాటు చేసుకొని నిఖిల్ అండ్ టీం ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడి నుండి నేరుగా విజయవాడ బయలుదేరారు.

ప్రస్తుతం టీం విజయవాడలో ఉంది. అక్కడ పీవీపీ మాల్ లో ఈ సాయంత్రం ఆడియన్స్ తో తమ సినిమా కంటెంట్ గురించి మాట్లాడబోతున్నారు. కొన్ని రోజులుగా నిఖిల్ ఈ సినిమా కోసం బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. అలాగే అనుపమ కూడా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. కమెడియన్స్ కూడా వారి వంతుగా సమయం కేటాయించి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన రెండు ట్రైలర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా విడుదలైన హిందీ ట్రైలర్ కూడా నార్త్ లో బజ్ క్రియేట్ చేస్తోంది. కార్తికేయ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అవే పాత్రలు ఉండబోతున్నాయి. కథ మాత్రం సంబంధం ఉండదని దర్శకుడు చందూ మొండేటి క్లారిటీ ఇచ్చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్  ఆర్ట్స్ బేనర్స్ పై TG విశ్వప్రసాద్ , అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు కాల భైరవ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

Karthikeya 2 – వైజాగ్ లో ల్యాండ్ అయిన టీమ్

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics