మిస్టర్ మజ్ను ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,January 28,2019 - 12:30 by Z_CLU

అఖిల్, నిధి అగర్వాల్ జంటగా నటించిన మిస్టర్ మజ్ను సినిమా సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. వెంకీ అట్లూరి డైరక్ట్ చేసిన ఈ సినిమా విడుదలైన ఈ 3 రోజుల్లో వరల్డ్ వైడ్ 10 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో స్టడీగా సాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు విడుదలైన 3 రోజుల్లో 7 కోట్ల 38 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ కు మెల్లగా ఎక్కుతోంది. ఇప్పుడిప్పుడే సినిమాకు పాజిటివ్ టాక్ ఊపందుకుంటోంది. నైజాంలో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తుండగా.. మిగతా ప్రాంతాల్లో కూడా మిస్టర్ మజ్ను కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి.

ఏపీ, నైజాం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్
నైజాం – రూ. 2.82 కోట్లు
సీడెడ్ – రూ. 1.07 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.95 కోట్లు
ఈస్ట్ – రూ. 0.49 కోట్లు
వెస్ట్ – రూ. 0.37 కోట్లు
గుంటూరు – రూ. 0.86 కోట్లు
కృష్ణా – రూ. 0.58 కోట్లు
నెల్లూరు – రూ. 0.24 కోట్లు