మహేష్ బాబు – థమన్ కాంబినేషన్ లో రాబోతున్న ‘సర్కారు వారి పాట’ నుండి మ్యూజిక్ అప్డేట్స్ బయటికొచ్చాయి. “ఇంకా చాలా టైం ఉంది … కానీ ఈసారి బుల్లెట్ కరెక్టుగా దింపుదాం… అదైతే ఫిక్సయ్యా. ఆగస్ట్ లో కలుద్దాం” అంటూ ఇది వరకే మహేష్ ఫ్యాన్స్ కి సోషల్ మీడియా ద్వారా రిప్లై ఇచ్చిన థమన్ లేటెస్ట్ గా సాంగ్స్ గురించి కొత్త అప్డేట్ అందించాడు.
లేటెస్ట్ గా ఈ సినిమా సాంగ్స్ గురించి కొన్ని విషయాలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు థమన్. సినిమాలో ఐదు పాటలుంటాయని, ఇప్పటికే మూడు పాటలు కంపోజ్ చేసి పెట్టానని చెప్పుకున్నాడు. మహేష్ తో ఆరేళ్ళ తర్వాత వర్క్ చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ తనకి ఎంతో స్పెషల్ అని తెలియజేశాడు.
లాక్ డౌన్ లో ఆల్బం కోసం చాలా పాటలు రెడీ చేశామని కానీ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరికి వెళ్ళిపోయింది కాబట్టి ఆ వర్క్ ఆపి బ్రేక్ తీసుకున్నామని చెప్పాడు. అందులో కొన్ని మాస్ సాంగ్స్ తో పాటు ఫ్యాన్స్ కోరుకునే ఎంటర్టైనింగ్ సాంగ్స్ ఉన్నాయని, ఒక స్పెషల్ సాంగ్ కి స్పేస్ ఉంది ఇంకా బుజ్జి దానికి ఫైనల్ చేయలేదని అన్నాడు.
బుజ్జితో ఇది తనకు మూడో సినిమా అని తమ ఇద్దరి మంచి రాపో ఉందని, మహేష్ గారి సినిమా కావడంతో బుజ్జి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వర్క్ చేస్తున్నాడని తెలియజేశాడు. దూకుడు తర్వాత మహేష్ గారి నుండి మళ్ళీ అంత ఎనర్జీ ఉండే సినిమా ఇది. అంటూ మ్యూజిక్ అప్ డేట్స్ అందించి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు తమన్. మరి ఆగస్టు నుండి విడపడే ‘సర్కారు వారి పాట’ సాంగ్స్ ఎంతటి హిట్ సాధిస్తాయో ఫ్యాన్స్ ని ఏ రేంజ్ లో అలరిస్తాయో చూడాలి.
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics