’సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుంచి ముచ్చటగా మూడో పాట వచ్చేసింది. ఈసారి పాట మొత్తం రష్మిక చుట్టూ తిరిగింది. హీ ఈజ్ సో క్యూట్ అంటూ సాగే లిరిక్స్ కు దేవిశ్రీప్రసాద్ ట్యూన్ అందించగా, మధుప్రియ ఆలపించింది. కేరళలో ఈ పాట షూట్ చేశారు. ఈసారి పాటతో పాటు మేకింగ్ కూడా రిలీజ్ చేశారు.
హీ ఈజ్ సో క్యూట్..హీ ఈజ్ సో స్వీట్..హీ ఈజ్ సో హ్యాండ్సమ్..అంటూ సూపర్స్టార్ మహేష్ గ్లామర్ను పొగిడే ఈ పాట సినిమాలో హీరోయిన్ మనసుని హీరో దోచుకునే సన్నివేశంలో వస్తుంది. రష్మిక, మహేష్ ఒకరినొకరు ఆటపట్టిస్తూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ కు శ్రీమణి సాహిత్యం అందించాడు.
క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ తో తన అభిమానులతో పాటు మహేష్ ఫ్యాన్స్ను కూడా బాగా ఆకట్టుకుంది రష్మిక. జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను జరిపి సంక్రాంతి కానుకగా జనవరి 11, 2020న ప్రపంచవ్యాప్తంగా ’సరిలేరు నీకెవ్వరు’ విడుదలవనుంది.