సైలెంట్ గా వచ్చి సెన్సేషనల్ హిట్టయింది జాతిరత్నాలు సినిమా. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ఈ సినిమా సమ్మర్ ఎట్రాక్షన్ గా వచ్చి సెన్సేషనల్ హిట్టయింది. అనుదీప్ దర్శకత్వంలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది.
జాతిరత్నాలు సినిమాలో తను రాసిన కామెడీ క్లిక్ అవ్వడంతో, ఇప్పుడు అదే పాట్రన్ లో మరో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు అనుదీప్. జాతిరత్నాలుగా నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పాత్రలు, వాటి స్వభావాలు ఏంటనేది ఆల్రెడీ ఆడియన్స్ కు రీచ్ అయిపోయింది కాబట్టి.. అవే క్యారెక్టర్స్ ను రిపీట్ చేస్తూ.. మరో కొత్త బ్యాక్ డ్రాప్ లో కథ రాస్తున్నాడు అనుదీప్.
జాతిరత్నాలు సినిమా కోసం పూర్తిగా కామెడీ మీద డిపెండ్ అయ్యాడు దర్శకుడు. మద్యమధ్యలో సస్పెన్స్, యాక్షన్, థ్రిల్, రొమాన్స్ చూపించే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ సందర్భాల్ని కూడా కామెడీ ఎలిమెంట్స్ తో నింపేశాడు. ఇలా ఔట్ అండ్ ఔట్ కామెడీ అందించడమే జాతిరత్నాలకు ప్లస్ అయింది.
ఈసారి కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వబోతున్నాడు అనుదీప్. ఏ కథ ఎంచుకున్నా.. దాని చుట్టూ కామెడీ కోటింగ్ మస్ట్ గా ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు, అదే చేస్తున్నాడు కూడా. జాతిరత్నాలు సినిమాలు జోగిపేట్ అనే ఊరిలో స్టార్ట్ చేసి, అదే ఊరిలో ముగించాడు దర్శకుడు. హీరో నవీన్, మ్యాచింగ్ అండ్ బ్యాంగిల్ సెంటర్ లో సెటిలవ్వడంతో సినిమాను ముగిస్తాడు. సీక్వెల్ ను కూడా అక్కడ్నుంచే స్టార్ట్ చేస్తున్నాడట దర్శకుడు. జాతిరత్నాలు సినిమాలో హిలేరియస్ గా పండిన కోర్టు డ్రామాను సీక్వెల్ లో కూడా కొనసాగించబోతున్నాడని టాక్.
జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్
ఒకరిద్దరు మినహా.. జాతిరత్నాలు సినిమాలో నటించిన కీలకమైన నటీనటులంతా సీక్వెల్ లో కూడా కనిపించబోతున్నారు. మరోవైపు టెక్నికల్ టీమ్ లో కూడా పెద్దగా మార్పులుండవని తెలుస్తోంది.
- – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics