టాలీవుడ్ చరిత్రలో ఈరోజు

Thursday,August 27,2020 - 07:01 by Z_CLU

ఈరోజు రెండు అపురూప చిత్రాలు చరిత్ర నిలిచిపోయేలా తెరకెక్కాయి. అందులో ఒకటి సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు  (Mosagallaku Mosagadu) కాగా.. రెండోది మనుషులు-మమతలు సినిమా.

మోసగాళ్లకు మోసగాడు
తెలుగులో మొట్టమొదటి కౌబాయ్ సినిమా 49 ఏళ్ల కిందట సరిగ్గా ఈరోజే విడుదలైంది. అవును.. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ సినిమా 1971, ఆగస్ట్ 27న విడుదలై ఈరోజుతో 49 ఏళ్లు పూర్తిచేసుకొని, 50వ వసంతం లోకి అడుగుపెట్టింది.

ఎంతో రిస్క్ చేసి తన సొంత బ్యానర్ పై Super Star Krishna చేసిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ కూడా ఈ సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అంతేకాదు, ఇండియాలోని అన్ని ప్రముఖ భాషలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో విడుదలైంది ఈ సినిమా.

మనుషులు-మమతలు
లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు, మహానటి సావిత్రి కలిసి నటించిన మరో అపురూప చిత్రం మనుషులు-మమతలు. 1965లో సరిగ్గా ఇదే రోజున (ఆగస్ట్ 27) విడుదలైన ఈ సినిమా ఏఎన్నార్ కెరీర్ లో మరపురాని చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. మేటి నటి, తమిళనాట రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన జయలలిత, ఈ సినిమాతోనే హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ప్రత్యగాత్మ డైరక్ట్ చేసిన ఈ సినిమా విడుదలైన ప్రతి సెంటర్ లో 100 రోజులాడింది.