Monday,November 25,2019 - 10:47 by Z_CLU
ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ “మెగాస్టార్ చిరంజీవిగారిని ఇప్పుడే కలుసుకున్నాం. ఆ అనుభూతి చాలా గొప్పగా అనిపించింది. మా `అర్జున్ సురవరం` సినిమాను చూసి ఆయన మమ్మల్ని ఆయన ఇంటికి పిలిచి మాట్లాడారు. ఆయనకు సినిమా బాగా నచ్చింది. మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆయన ముఖ్య అతిథిగా వస్తానని అన్నారు.“ అన్నారు.
నకిలీ సర్టిఫికేట్స్ కుంభకోణంలో అర్జున్ సురవరం అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అరెస్ట్ అవుతాడు. ఆ కేసును ఆ జర్నలిస్ట్ ఎలా చేధించాడనేదే ఈ సినిమా కథ. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ ఎల్ పి బ్యానర్పై రాజ్కుమార్ ఆకెళ్ల నిర్మాతగా టి.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది.