మెగాస్టార్ ప్రత్యేక అతిథిగా అర్జున్ సురవరం ప్రీ-రిలీజ్

Monday,November 25,2019 - 10:47 by Z_CLU

హీరో నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. న‌వంబ‌ర్ 29న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పీపుల్స్ ప్లాజాలో నిర్వ‌హించ‌బోతున్నారు. చిరంజీవి చీఫ్ గెస్ట్ గా ఈ ఈవెంట్ జరగబోతోంది.

ఈ సంద‌ర్భంగా నిఖిల్ మాట్లాడుతూ “మెగాస్టార్ చిరంజీవిగారిని ఇప్పుడే క‌లుసుకున్నాం. ఆ అనుభూతి చాలా గొప్ప‌గా అనిపించింది. మా `అర్జున్ సుర‌వ‌రం` సినిమాను చూసి ఆయ‌న మ‌మ్మ‌ల్ని ఆయ‌న ఇంటికి పిలిచి మాట్లాడారు. ఆయ‌న‌కు సినిమా బాగా న‌చ్చింది. మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా వ‌స్తాన‌ని అన్నారు.“ అన్నారు.

న‌కిలీ స‌ర్టిఫికేట్స్ కుంభ‌కోణంలో అర్జున్ సుర‌వ‌రం అనే ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ అరెస్ట్ అవుతాడు. ఆ కేసును ఆ జ‌ర్న‌లిస్ట్ ఎలా చేధించాడ‌నేదే ఈ సినిమా క‌థ‌. ప్ర‌ముఖ నిర్మాత ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మాత‌గా టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది.