Megastar Chiranjeevi to follow Venkatesh’s strategy !

Saturday,November 20,2021 - 10:00 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఆచార్య' సెట్స్ పై ఉండగానే రెండు సినిమాలు మొదలు పెట్టేశారు చిరు. అయితే వీటిలో రెండు సినిమాలు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. చిరు గతంలో చాలానే రీమేక్ సినిమాలు చేశారు. అంతెందుకు రీ ఎంట్రీ కోసం కూడా రీమేక్ సినిమానే ఎంచుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి రెండు రీమేక్ సినిమాలు చేయలేదు. ఇప్పుడు అదే చేస్తున్నారు చిరు.

టాలీవుడ్ లో వరుస రీమేక్ సినిమాలు ఎక్కువగా చేసేది విక్టరీ వెంకటేష్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇండస్ట్రీలో వెంకీ ని రీమేక్ రాజా అంటుంటారు. ఇటివలే వెంకీ నటించిన 'నారప్ప', 'దృశ్యం2' రెండూ సినిమాలు రీమేకే. ఒక వైపు స్ట్రైట్ కథలతో సినిమాలు చేస్తూనే మరో వైపు సేఫ్ జోన్ అని భావించి వరుసగా రీమేక్ సినిమాలు చేస్తుంటాడు వెంకీ. ఇప్పుడు వెంకీ ని ఫాలో అవుతూ బ్యాక్ టు బ్యాక్ రీమేక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు మెగాస్టార్.

ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో చిరు నటిస్తున్న 'గాడ్ ఫాథర్' సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన 'లూసిఫర్' కి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇటివలే ప్రారంభమైన చిరు -మెహర్ కాంబో సినిమా 'భోళా శంకర్' తమిళ్ బ్లాక్ బస్టర్ 'వేదాళం' కి రీమేక్ గా తెరకెక్కుతుంది.  మరి ఈ మెగా రీమేక్ సినిమాలతో చిరు మెగా హిట్స్ అందుకుంటే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics