మెగా స్టార్ చిరంజీవి జెట్ స్పీడులో సినిమాలు చేస్తున్నారు. 'ఆచార్య' సెట్స్ పై ఉండగానే ఆయన మూడు సినిమాలు ఎనౌన్స్ చేసి అందులో ఒకటైన 'గాడ్ ఫాదర్' సినిమాను సెట్స్ పై పెట్టేశారు. అలాగే మెహర్ రమేష్ తో 'భోళా శంకర్' , బాబీ డైరెక్షన్ లో ఇంకో సినిమా చేయబోతున్నారు. వీటితో పాటు నెక్స్ట్ లైనప్ కూడా సెట్ చేసుకుంటున్నారు. అవును ఆ లిస్టు లో దర్శకుడు మారుతి కూడా ఉన్నాడు.
ఇటివలే మెగా స్టార్ ని కలిసి ఓ పాయింట్ వినిపించాడు. మారుతి చెప్పిన లైన్ చిరుకి నచ్చడంతో ఇప్పుడు దాన్ని డెవలప్ చేసే పనిలో ఉన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకున్నాడు మారుతి.ప్రస్తుతం చిరు కమిట్ అయిన మూడు సినిమాలు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. వాటి తర్వాత మారుతి కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక మారుతి కూడా గోపీచంద్ తో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. మెగా ప్రాజెక్ట్ సెట్ అయ్యే లోపు ఇంకో సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడు మారుతి. ఈ కాంబో సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించే అవకాశం ఉంది.
ఏదేమైనా మెగా స్టార్ తనను డైరెక్ట్ చేయాలని ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న డైరెక్టర్స్ కి ఒక్కో ప్రాజెక్ట్ ఇస్తూ వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. మరి చిరు -మారుతి ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics