Chiranjeevi’s Acharya Postponed Indefinitely
Tuesday,April 27,2021 - 02:25 by Z_CLU
మెగాస్టార్ 'ఆచార్య' సినిమా వచ్చే నెల మే 13న థియేటర్స్ లోకి రానుందని మొన్నీ మధ్య ప్రకటించారు మేకర్స్. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రిలీజ్ వరకూ వచ్చిన అన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల మెగాస్టార్ సినిమా వస్తుందా ? రాదా అనే డైలమాలో ఉన్నారు మెగా ఫ్యాన్స్. అయితే తాజాగా ప్రేక్షకుల్లో ఉన్న సందేహాలకు క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కోవిడ్ 19 వ్యాప్తి ఎక్కువగా ఉండటం, పరిస్థితులు బాగాలేని కారణంగా వచ్చే నెల 13 న విడుదల రానున్న 'ఆచార్య' సినిమాను వాయిదా వేస్తున్నామని అఫీషియల్ గా ప్రకటించారు. అన్ని చక్క బడ్డాక సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తామని చెప్పారు. దీంతో ఆచార్య రిలీజ్ పై అందరికీ క్లారిటీ వచ్చేసింది.
నిజానికి ఆచార్య షూటింగ్ లో నటుడు సోనూ సూద్ తో పాటు పూజా హెగ్డే కి కూడా కరోన సోకింది. ముందుగా సోనూ సూద్ కి పాజిటివ్ అని తెలియగానే యూనిట్ షూటింగ్ క్యాన్సల్ చేసుకున్నారు. ఆ వెంటనే మెగా స్టార్ చిరుతో పాటు మిగతా టీం అందరూ హోం క్వారెంటైన్ కి వెళ్లారు. దీంతో నిర్విరామంగా జరుగుతున్న ఆచార్య షూట్ మొత్తానికి వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే షూటింగ్ మొదలు పెట్టె ఆలోచనలో లేరు మేకర్స్. సో షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటం పైగా సిచ్యువేషన్ బాగోలేకపోవడంతో ఉన్నపళంగా రిలీజ్ డేట్ ని వాయిదా వేశారు.
ఆచార్య కి సంబంధించి ఇంకా కొన్ని మేజర్స్ సీన్స్ పెండింగ్ లో ఉన్నాయి. అవి పూర్తవ్వగానే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. జులై లేదా ఆగస్ట్ లో ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. మెగా స్టార్ చిరంజీవితో కలిసి రామ్ చరణ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ , కొణిదెల ప్రొడక్షన్ కంపనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరు సరసన కాజల్ , చరణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో సోనూ సూద్ విలన్ గా నటిస్తున్నాడు. మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.
- - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
stories, Gossips, Actress Photos and Special topics