Zombie Reddy - కరవడానికి రెడీ
Thursday,November 19,2020 - 04:17 by Z_CLU
ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న మూడో చిత్రం ‘జాంబీ రెడ్డి’ షూటింగ్ పూర్తయింది. బాలనటునిగా అందర్నీ ఎట్రాక్ట్ చేసి, ‘ఓ బేబీ’ చిత్రంలో చేసిన కీలక పాత్రతో ఆకట్టుకున్న తేజ సజ్జా హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆనంది, దక్ష హీరోయిన్లు.
నిన్న Zombie Reddy చిత్రానికి సంబంధించి డబ్బింగ్ వర్క్ మొదలైంది. మొదటగా హీరో తేజ సజ్జా తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడు. త్వరలో టీజర్ రిలీజ్ చేస్తారు.
టాలీవుడ్కు జాంబీ కాన్సెప్ట్ను పరిచయం చేస్తూ మరో హై-కాన్సెప్ట్ ఫిల్మ్తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మన ముందుకు వస్తున్నాడు. అంతేకాదు.. కరోనా బ్యాక్ డ్రాప్ తో వస్తున్న తొలి చిత్రం కూడా ఇదే.