జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,June 09,2019 - 10:02 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను  బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ రెండో సినిమా ‘హిప్పీ’ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.మరి కార్తికేయ రెండో సినిమాతో మరో హిట్టు కొట్టాడా..?  జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సెవెన్’ థియేటర్స్ లోకి వచ్చింది. ఆరుగురు హీరోయిన్స్ నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తో ఎట్రాక్ట్ చేసింది. మరి డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేసిందా..? హవీష్ ఈ సినిమాతో హిట్ కొట్టాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

‘బిచ్చగాడు’ తర్వాత ఆ రేంజ్ హిట్ ని అందుకోవడానికి శతవిధాల ప్రయత్నించాడు విజయ్ ఆంటొని… కాకపోతే అవేవి తెలుగు ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయాయి. అందుకే ఈసారి అర్జున్ తో కలిసి ఓ థ్రిల్లర్ సినిమా చేసాడు. క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘కిల్లర్’  థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈసారైనా విజయ్ ఆంటొని మెప్పించాడా… జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నాగార్జున నటిస్తున్న ‘మన్మధుడు 2’ లో మరో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది.నాగార్జునతో కీర్తి నటిస్తున్న మానిటర్ షాట్ ని షేర్ చేస్తూ… ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫమ్ చేశాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోహీరోయిన్లుగా నటించిన దొరసాని టీజర్ రిలీజైంది. ఇంతకుముందే ఫస్ట్ లుక్ లో చూపించినట్టు, అంతా ఎక్స్ పెక్ట్ చేసినట్టే ఉంది టీజర్. ఓ పేద కుర్రాడికి, గడీలోని ధనిక దొరసానికి మధ్య జరిగిన అందమైన ప్రేమకథ ఇది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి