బ్రహ్మ పుత్రుడు
నటీనటులు : వెంకటేష్, రజని
ఇతర నటీనటులు : మోహన్ బాబు, జయసుధ, నూతన ప్రసాద్, శ్రీ దివ్య, బేబీ శాలిని, అల్లు రామలింగయ్య తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి
డైరెక్టర్ : దాసరి నారాయణ రావు
ప్రొడ్యూసర్ : డి. రామానాయుడు
రిలీజ్ డేట్ : 27 ఆగష్టు 1988
1988 లో రిలీజైన బ్రహ్మపుత్రుడు తో వెంకటేష్ ని మాస్ హీరోల లిస్టులోకి చేర్చేసింది. తమిళం లో రీమేక్ అయిన మైకేల్ రాజ్ కి రీమేక్ ఈ సినిమా. వెంకటేష్ ఈ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ సినిమాని దాసరి నారాయణ రావు గారు తెరకెక్కించారు.
==============================================================================
కృష్ణార్జున
హీరోహీరోయిన్లు – మంచు విష్ణు, మమతా మోహన్ దాస్
ఇతర నటీనటులు – నాగార్జున, మోహన్ బాబు, నాజర్, నెపోలియన్, సునీల్, బ్రహ్మానందం
సంగీతం – ఎం.ఎం. కీరవాణి
దర్శకత్వం – పి.వాసు
విడుదల తేదీ – 2008, ఫిబ్రవరి 1
లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మించడమే కాకుండా.. ఓ కీలక పాత్ర కూడా పోషించిన చిత్రం కృష్ణార్జున. మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నాగార్జున కూడా మరో కీలక పాత్ర పోషించడంతో ఇది భారీ సినిమాగా మారిపోయింది. కృష్ణుడిగా నాగార్జున, భక్తుడిగా విష్ణు చేసిన హంగామా ఈ సినిమాకు హైలెట్. సినిమా మధ్యలో మోహన్ బాబు, బాబా గెటప్ లో అలరిస్తారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించారు. తెలుగులో సోషియో-ఫాంటసీ జానర్ లో వచ్చిన అతికొద్ది చిత్రాల్లో ఇది కూడా ఒకటి.
==============================================================================
అష్టా చెమ్మా
నటీనటులు : నాని, శ్రీనివాస్ అవసరాల, స్వాతి, భార్గవి
ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, హేమ, ఝాన్సీ, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రాగిణి
మ్యూజిక్ డైరెక్టర్ : కల్యాణి మాలిక్
డైరెక్టర్ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి
ప్రొడ్యూసర్ : రామ్ మోహన్
రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 2008
నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి, భార్గవి నలుగురికి ఒకేసారిగా ఓ రేంజ్ స్టార్ డం ని తీసుకొచ్చి పెట్టిన సినిమా ‘అష్టా చెమ్మా’. సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్ళి చేసుకోవాలనుకునే లావణ్య చివరికి మహేష్ అనే పేరున్నా చాలు అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఆ తరవాత ఏం జరిగింది అన్నదే ప్రధాన కథాంశం.
==============================================================================
Mr. పెళ్ళాం
నటీ నటులు : రాజేంద్ర ప్రసాద్, ఆమని
ఇతర నటీనటులు : A.V.S, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ళ భరణి, గుండు సుదర్శన్, జెన్నీ, మాస్టర్ ఉదయ్, బేబీ అనురాధ
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి
డైరెక్టర్ : బాపు
ప్రొడ్యూసర్ : గవర పార్థ సారథి
రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 1993
బాపు గారు తెరకెక్కించిన అద్భుతాలలో Mr. పెళ్ళాం ఒకటి. ఆలు, మగలలో ఎవరు గొప్ప అనే సున్నితమైన అంశంతో మనసుకు హత్తుకునే సన్నివేశాలతో తెరకెక్కిన ‘మిస్టర్ పెళ్ళాం’ లో రాజేంద్ర ప్రసాద్. ఆమని జంటగా నటించారు. ఈ సినిమాకి M.M. కీరవాణి సంగీతం అందించారు.
=============================================================================
శివపురం
నటీనటులు : పృథ్వీ రాజ్, కావ్య మాధవన్
ఇతర నటీనటులు : మనోజ్ K జయన్, కళాభవన్ మణి, బిజు మీనన్, రియా సేన్, కొచిన్ హనీఫా, సురేష్ కృష్ణ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : M.G. రాధా కృష్ణన్
డైరెక్టర్ : సంతోష్ శివన్
ప్రొడ్యూసర్ : మనియన్ పిల్ల రాజు
రిలీజ్ డేట్ : 4 నవంబర్ 2005
పృథ్వీరాజ్, కావ్య మాధవన్ నటించిన అల్టిమేట్ ఫ్యాంటసీ థ్రిల్లర్ శివపురం. సంతోష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన ఈ సినిమా 5 స్టేట్ అవార్డులను దక్కించుకుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్.
==============================================================================
దమ్ము
నటీనటులు : N.T.R, త్రిష కృష్ణన్, కార్తీక నాయర్
ఇతర నటీనటులు : వేణు తొట్టెంపూడి, అభినయ, భానుప్రియ, నాజర్, సుమన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, సంపత్ రాజ్, కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి
డైరెక్టర్ : బోయపాటి శ్రీను
ప్రొడ్యూసర్ : అలెగ్జాండర్ వల్లభ
రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2012
బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ దమ్ము. N.T.R స్టామినా పర్ ఫెక్ట్ గా ఎలివేట్ అయిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించాడు. యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.
==============================================================================
మైసమ్మ IPS
నటీ నటులు : ముమైత్ ఖాన్, సాయాజీ షిండే
ఇతర నటీనటులు : రఘుబాబు, జీవా, బ్రహ్మానందం, M.S.నారాయణ, ప్రదీప్ రావత్
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. శ్రీలేఖ
డైరెక్టర్ : భరత్ పారెపల్లి
ప్రొడ్యూసర్ : దాసరి నారాయణ రావు
రిలీజ్ డేట్ : 2008
పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మైసమ్మను తన అక్క దుర్గ పెంచుతుంది. ఆ ఊళ్ళో రౌడీయిజం చలాయించే ఒక రౌడీ దుర్గను పెళ్లి చేసుకుని వ్యభిచారం చేయిస్తున్నాడు. అన్నీ సహించిన దుర్గ, తన భర్త, మైసమ్మను బలాత్కారం చేస్తుంటే తట్టుకోలేక ఆ అమ్మాయిని తీసుకుని పారిపోతుంటుంది. అది చూసిన ఆ రౌడీ ఆ ఇద్దరి పైకి కుక్కలను ఉసి గొల్పుతాడు. ఎలాగోలా మైసమ్మను కాపాడుకున్న ఆమె ఆ కుక్కలా బారిన పడి చనిపోతుంది. మైసమ్మ IPS గా ఎదిగి ఎలా పగ సాధిస్తుంది అన్నదే ప్రధాన కథాంశం.