'యాత్ర' రిలీజ్... అంతా రెడీ

Thursday,January 24,2019 - 10:01 by Z_CLU

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న ‘యాత్ర’ రిలీజ్ కి రెడీ అవుతోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టీ వై.ఎస్ పాత్రలో నటించిన ఈ సినిమా ఇటివలే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు మేకర్స్. ఇప్పటికే టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటీవ్ బజ్ క్రియేట్ చేసాయి. ముఖ్యంగా ట్రైలర్ లో మముట్టీ చెప్పిన డైలాగ్స్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

‘వై ఎస్ ఆర్’ రాజకీయ జీవితంలో కీలక ఘట్టం అయిన పాదయాత్ర… ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది యాత్ర. ‘ఆనందొ బ్ర‌హ్మ’ ఫేం మ‌హి వి రాఘ‌వ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా … ’70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్’ భారీ వ్య‌యంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. ఫిబ్ర‌వరి 8న యాత్ర‌ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ళ‌యాలంలో కూడా ఫిబ్ర‌వ‌రి 8న రిలీజ్ కానుంది.