టాలీవుడ్ లో సత్తా చాటుతుందా..?

Sunday,July 16,2017 - 02:16 by Z_CLU

ప్రెజెంట్ వరుస సినిమాలతో టాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు మల్లువుడ్ బ్యూటీస్.. ఈ లిస్ట్ లో అనుపమ పరమేశ్వరన్, నివేత థామస్ చేరగా లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది మల్లు బ్యూటీ సాయి పల్లవి. మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో అందరినీ ఆకట్టుకొని క్రేజీ బ్యూటీ గా గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి లేటెస్ట్ గా వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది.

షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెల 21 థియేటర్ లోకి రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న ఈ బ్యూటీ సినిమాలో భానుమతి గా తన గ్లామరస్ పర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షలుకులను కచ్చితంగా ఫిదా చేస్తుందని చెప్తున్నారు మేకర్స్. ఫిదా సెట్స్ పై ఉండగానే నాని ‘MCA’ లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన ఈ భామ ‘ఫిదా’ తో హీరోయిన్ గా సత్తా చాటి తెలుగులో మరిన్నిక్రేజీ ఆఫర్స్ అందుకుంటుందేమో చూడాలి.