#Mahesh28 - ఫ్యాన్స్ కోరిక నెరవేరనుందా?
Saturday,May 01,2021 - 02:03 by Z_CLU
మహేష్ అభిమానులకి ప్రస్తుతం ఓ కోరిక ఉంది. తమ అభిమాన హీరోకి బెస్ట్ ఆల్బమ్స్ అందించి సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించిన మణి మళ్ళీ మహేష్ సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలని కొన్నేళ్ళుగా అభిమానులు ఆశ పడుతున్నారు. మహేష్ కొత్త సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా వేదికగా మ్యూజిక్ మణిశర్మ ని పెట్టుకోండి అంటూ దర్శక నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తుంటారు. ‘సర్కారు వారి పాట’ విషయంలోనూ అదే జరిగింది. సినిమా ఎనౌన్స్ మెంట్ రాకముందే మణిశర్మ పేరు తెరపైకి తెచ్చారు ఫ్యాన్స్. తీరా మేకర్స్ తమన్ పేరు ప్రకటించే సరికి సైలెంట్ అయిపోయారు.
ఎట్టకేలకు ఇప్పుడు అభిమానుల కోరిక నెరవేరబోతుంది. అవును మహేష్ నెక్స్ట్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. కొన్నేళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ కాంబోలో సినిమా రాబోతుంది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘అతడు’,’ఖలేజా’ సినిమాలకు మణిశర్మ మ్యూజిక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాలకు బెస్ట్ మ్యూజిక్ అందించాడు మణి. ఇన్నాళ్ళయిన ‘అతడు’,’ఖలేజా’ పాటలు ఇంకా ఎక్కడో చోట వినబడుతూనే ఉంటాయి.
అందుకే మళ్ళీ మణిశర్మ ని పెట్టుకొని తమ కాంబినేషన్ ని రిపీట్ చేయాలని భావిస్తున్నాడట త్రివిక్రమ్. ఈ మేరకు మహేష్ తో కూడా సంప్రదింపులు జరిపాడట. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ తో ఐయాం బ్యాక్ అంటూ మళ్ళీ ఫాంలోకి వచ్చిన మణిశర్మ ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’,’వెంకటేష్ ‘నారప్ప’ సినిమాలకు మ్యూజిక్ చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత మణి చేయబోయే మరో పెద్ద సినిమా మహేష్ దే అంటున్నారు. మరి ఈ విషయంపై ఇంకాస్త క్లారిటీ రావాలంటే #Mahesh28 ఎనౌన్స్ మెంట్ వరకు వేచి ఉండాలి. ఈ రోజు సాయంత్రం ఈ సినిమాకు సంబంధించి ప్రకటన రాబోతుంది. ఎనౌన్స్ మెంట్ పోస్టర్ మీద మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ పేరు కూడా చెప్పే అవకాశం ఉంది.
- – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
stories, Gossips, Actress Photos and Special topics