అదిరిపోయే టైటిల్... చైతూతో మరోసారి ?

Tuesday,October 30,2018 - 10:55 by Z_CLU

‘ప్రేమమ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య- చందూ మొండేటి మరోసారి ‘సవ్యసాచి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 2 న థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు చందూ మొండేటి మరో ఇంట్రెస్టింగ్ సినిమా గురించి రివిల్ చేసాడు.

‘ప్రేమమ్’ సినిమా కంటే ముందు తను ‘చాణక్య’ అనే కథతో చైతూని సంప్రదించానని.. ఆ సమయంలో ఆ కథను పక్కన పెట్టి ప్రేమమ్ రీమేక్ చేయాల్సి వచ్చిందని తెలిపాడు చందూ.. సో ‘చాణక్య’ కి సంబంధించి చందూ మైండ్ లో ఉన్న హీరో చైతూనే కాబట్టి ముచ్చటగా మూడో సారి చైతూతో చందూ ఈ సినిమా చేసే ఛాన్స్ ఉంది.