షూటింగ్ పూర్తి చేసుకున్న 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి'

Saturday,February 02,2019 - 12:14 by Z_CLU

లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’.. రామ్ కార్తిక్ , పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.. హార్రర్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తుంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శెరవేగంగా జరుగుతున్నాయి..

కాగా ఇటీవలే ఈ చిత్రం నుంచి వచ్చిన ‘పాపా నీకేదంటే ఇష్టం’ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది.. మాస్ హంగులు జోడించి ఈ పాటను చిత్రీకరించారు.. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగ, త్వరలో టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు..

ఈ చిత్రంలో నటిస్తున్న హాస్యనటులు ప్రవీణ్, మధునందన్ ల కామెడీ హైలైట్ గా నిలవనుంది.. హరి గౌర ఈ చిత్రానికి సంగీతం అందించగా, వెంకట్ ఆర్.శాఖమూరి సినిమాటోగ్రఫీ ని అందించారు.. ఏబీటి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై గురునాథ్ రెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమా కి ఎం.శ్రీధర్ రెడ్డి , హెచ్.ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.. మార్చి లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..

నటీనటులు : రాయ్ లక్ష్మీ, ప్రవీణ్, మధు నందన్, రామ్ కార్తిక్, పూజిత పొన్నాడ, బ్రహ్మాజీ, పంకజ్ కేసరి, అన్నపూర్ణమ్మ, జబర్దస్త్ మహేష్, జెమినీ సురేష్ తదితరులు..

సాంకేతిక నిపుణులు :

దర్శకత్వం : కిషోర్ కుమార్
నిర్మాతలు: ఎం.శ్రీధర్ రెడ్డి , హెచ్.ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి
బ్యానర్ : ఏబీటి క్రియేషన్స్
సమర్పణ : గురునాథ్ రెడ్డి
సినిమాటోగ్రఫీ : వెంకట్ ఆర్.శాఖమూరి
మ్యూజిక్ : హరి గౌర
కథ, కథనం, మాటలు : తాటవర్తి కిరణ్
ఎడిటర్ : ఎస్.ఆర్. శేఖర్
ఆర్ట్ : బ్రహ్మ కడలి
ఫైట్స్ : రామ్ సుంకర
డాన్స్ మాస్టర్ : శేఖర్