బాలీవుడ్ లో 2 డిఫరెంట్ సినిమాలు...

Thursday,October 27,2016 - 01:05 by Z_CLU

ఈ వీకెండ్ బాలీవుడ్ లో 2 డిఫరెంట్ మూవీస్ సందడి చేయబోతున్నాయి. వీటిలో ఒకటి ఐశ్వర్యరాయ్-రణబీర్ కపూర్ కలిసి నటించిన యే దిల్ హే ముష్కిల్ కాగా… మరొకటి అజయ్ దేవగన్ నటించిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ శివాయ్. ఈ రెండూ వేటికవే డిఫరెంట్ మూవీస్ కావడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. మరీ ముఖ్యంగా ఏ దిల్ హే ముష్కిల్ సినిమాలో ఐశ్వర్యరాయ్.. హాట్ హాట్ గా అందాలు ఆరబోసిందని… రణబీర్ కపూర్ తో ఘాటైన సన్నివేశాల్లో నటించిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఈమధ్య చాలా పెద్ద దుమారమే చెలరేగింది. అందుకే అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.

అటు యాక్షన్ ఎంటర్ టైనర్ శివాయ్ పై కూడా అంచనాలున్నాయి. అజయ్ దేవగన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో… అఖిల్ బ్యూటీ సాయేషా సైగల్ హీరోయిన్ గా నటించింది. ట్రయిలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి.