పేద సినీ క‌ళాకారులకు వినాయక్ విరాళం

Wednesday,March 25,2020 - 02:08 by Z_CLU

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా షూటింగ్స్ నిలిచిపోవ‌డంతో దిన‌స‌రి వేత‌నంతో బ‌తికే పేద క‌ళాకారులు, టెక్నీషియ‌న్స్ ఇబ్బందులు ప‌డుతున్నారు. అలాంటి వారికి సాయం చేసేందుకు డైరెక్ట‌ర్ వి.వి. వినాయ‌క్ త‌న వంతు సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చారు.

న‌టుడు కాదంబ‌రి కిర‌ణ్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోన్న ‘మ‌నం సైతం’ ఫౌండేష‌న్‌కు రూ. 5 ల‌క్ష‌లు అంద‌జేశారు. నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుక్కోవ‌డానికి కూడా ఇబ్బందులు ప‌డుతున్న పేద సినీ క‌ళాకారులు, సాంకేతిక విభాగాల్లో ప‌నిచేసే కార్మికులు మ‌నం సైతంను సంప్ర‌దించి, వాటిని పొంద‌వ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు.

ఈ విష‌యాన్ని ఒక వీడియో సందేశం ద్వారా వినాయ‌క్ వెల్ల‌డించారు. ఆయ‌న మాట్లాడుతూ, “ఈరోజు అంద‌ర్నీ వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్‌ను మ‌న ఇళ్ల‌ల్లో మ‌నం ఉండి వ‌ణికించాలి. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని పేద క‌ళాకారులు, టెక్నీషియ‌న్లు, డాన్స‌ర్లు, ఫైట‌ర్లు.. ఎవ‌రైనా కానివ్వండి.. నెల రోజుల పాటు షూటింగ్స్ లేక చాలా ఇబ్బందులు ప‌డుతుంటారు. వాళ్ల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను అంద‌జేసే నిమిత్తం నా వంతుగా రూ. 5 ల‌క్ష‌ల చెక్కును మ‌నం సైతం కాదంబ‌రి కిర‌ణ్‌కుమార్‌కు అంద‌జేస్తున్నా.” అని చెప్పారు.