'ఉన్నది ఒక్కటే జిందగీ' సెన్సార్ పూర్తి

Friday,October 20,2017 - 06:55 by Z_CLU

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఉన్నది ఒక్కటే జిందగీ. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైన ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది. సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ అధికారులు.. మూవీని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్, అభ్యంతరకర సన్నివేశాలు లేకుండా సినిమాను తెరకెక్కించిన యూనిట్ ను అభినందించారు.

రామ్-కిషోర్ తిరుమలది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన నేను శైలజ సినిమా పెద్ద హిట్ అయింది. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వస్తున్న ఉన్నది ఒక్కటే జిందగీపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే సూపర్ హిట్ అవ్వడంతో.. ఎక్స్ పెక్టేషన్స్ డబుల్ అయ్యాయి.

‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. అభిరామ్ అనే వ్యక్తి చుట్టూ జరిగే సంఘటనల సమాహారంతో కంప్లీట్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కింది ఉన్నది ఒక్కటే జిందగీ