రేపటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేయనున్న రామ్

Thursday,October 05,2017 - 12:10 by Z_CLU

ప్రస్తుతం రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఉన్నది ఒకటే జిందగీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 27 న రిలీజ్ కానుంది. రిలీజ్ కి దగ్గర పడుతుండడంతో రేపటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నారు మేకర్స్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సింగల్ ను ఇటీవలే రిలీజ్ చేయగా సినిమాలోని ‘వాట్ అమ్మ’ అనే రెండో సింగల్ ను రేపు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు.

లేటెస్ట్ గా రేపు సింగల్ రిలీజ్ అంటూ తన స్టైల్ లో చెప్పాడు రామ్… ‘ఉన్నది ఒకటే జిందగీ’ 27న రిలీజ్ అని చెప్పి ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదేంటి..? వాట్ అమ్మ .. వాట్ ఈజ్ దిస్ అమ్మ ..? అని అడిగే వాళ్ళకి లెట్స్ బిగిన్ బాంగ్ అంటూ ఈ సాంగ్ తో రిలీజ్ ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపాడు ఎనర్జిటిక్ స్టార్.

రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్‌ బ్యానర్ పై కృష్ణచైతన్య నిర్మిస్తున్నాడు.