ప్రారంభమైన విశాల్-లింగుస్వామి సినిమా

Wednesday,September 20,2017 - 06:26 by Z_CLU

విశాల్- లింగుస్వామి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సండకోళి’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే.. తెలుగులో ‘పందెం కోడి’ గా విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేసి ఇక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచి విశాల్ ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఇప్పుడు అదే కాంబినేషన్ లో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ స్వయంగా నిర్మించనున్నాడు.. తాజాగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు యూనిట్. ‘సండకోళి’ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సండకోళి 2’ టైటిల్ నే ఫిక్స్ చేశారు. విశాల్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు యువన్ శంకర్ మ్యూజిక్ అందించనున్నాడు. తెలుగులో కూడా ఈ సినిమాను ‘పందెం కోడి 2’ టైటిల్ తోనే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు విశాల్.