వినాయక్ - సాయి ధరమ్ తేజ్ సినిమాలో అదే హైలైట్

Saturday,October 14,2017 - 06:57 by Z_CLU

జవాన్ సినిమాను రిలీజ్ కి రెడీ చేసిన మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ వి.వినాయక్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వినాయక్ స్టైల్ యాక్షన్ పార్ట్ సినిమాకు హైలైట్ అని తెలుస్తుంది. ఇప్పటి వరకూ సుప్రీమ్ హీరోను చూడని విధంగా ఓ డిఫరెంట్ మాస్ రోల్ లో చూపిస్తూ సిసలైన యాక్షన్ తో ఎంటర్టైన్ చేయబోతున్నాడట వినాయక్.

భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫైట్ సీన్ ను  ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన భారీ సెట్లో షూట్ చేస్తున్నారు యూనిట్. ఈ ఫైట్ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని చెప్తున్నారు యూనిట్.   సి.కె.ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా  తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు .