మణిరత్నం తర్వాత పూరి జగన్నాథే...

Tuesday,March 14,2017 - 12:48 by Z_CLU

పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘రోగ్’ సినిమా ఆడియో వేడుక ఇటీవలే గ్రాండ్ గా జరిగింది.. ఈ ఆడియో వేడుకలో మణిరత్నం తర్వాత పూరి జగన్నాథే అన్నాడు వి.వి.వినాయక్… ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరైన వినాయక్ మాట్లాడుతూ ” నాకు జగ్గు భయ్యా డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ తన టేకింగ్ గాని చాలా డిఫరెంట్ గా ఉంటాయి.. ఇప్పటి వరకూ మణిరత్నం గారు పూరి జగన్నాథ్ గారు వీరిద్దరూ మాత్రమే ఎన్ని సినిమాలు తీశారో అన్ని సినిమాల కథలు సొంతం రాసుకున్నారు.. పూరి తీసిన సినిమాలన్నీ ఒక్క టెంపర్ తప్ప తను సొంతం గా రాసుకున్న కథలే..నిజానికి పూరి ఓ ట్రూ క్రియేటర్ అని చెప్పాలి… ఇంకా ఇలాంటి ఎన్నో సూపర్ హిట్స్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఆకాష్ ని లాంచ్ చేసి ఆ ఫంక్షన్ లో కలవాలి” అన్నారు..