విజయేంద్ర ప్రసాద్ సునామీ

Tuesday,January 24,2017 - 12:20 by Z_CLU

దాదాపు నాలుగేళ్ళుగా అందరి కళ్ళు జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బాహుబాలి పైనే. ఈ ఎగ్జైట్ మెంట్ లో ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ సునామీ షూటింగ్ బిగిన్ అయింది, దాదాపు కంప్లీట్ అయ్యే స్టేజ్ కి కూడా వచ్చేసింది. రాజన్న లాంటి హిస్టారికల్ హిట్ తరవాత ఈ సక్సెస్ ఫుల్ రైటర్, వెండితెరపై సునామిని సృష్టించేశాడు.

రష్యా, అమెరికా యుద్ధ పరిణామాలు, అవి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన సునామీకి దారి తీసిన పరిస్థితులపై అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్న విజయేంద్ర ప్రసాద్, ఈ సినిమాకి ‘శ్రీవల్లీ’ అని టైటిల్ ని ఫిక్స్ చేశారు.

నిన్న గ్రాండ్ గా ఆడియో రిలీజ్ జరుపుకున్న సినిమా యూనిట్, ఇది కంప్లీట్ సైన్స్ ఫిక్షన్ సినిమా అని క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమాలో రజత్, నేహా హింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ సినిమాకి M.M. శ్రేలేఖ, శ్రీ చరణ్ సంగీతం అందించారు.