13 ఏళ్ల తర్వాత మళ్లీ సెట్స్ పైకి

Monday,August 12,2019 - 02:43 by Z_CLU

ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడంతో లాంగ్ గ్యాప్ తప్పలేదు. అలా దశాబ్దానికి పైగా కెమెరాకు దూరమైన విజయశాంతి ఎట్టకేలకు మళ్లీ సెట్స్ పైకి వచ్చారు. ఇంకా చెప్పాలంటే 13 ఏళ్ల తర్వాత విజయశాంతి మేకప్ వేసుకున్నారు. సరిలేరు నీకెవ్వరు సెట్స్ పై జాయిన్ అయ్యారు.

మహేష్ బాబు హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోంది సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో విజయశాంతి కోసం ప్రత్యేకంగా ఓ క్యారెక్టర్ డిజైన్ చేశాడు అనీల్ రావిపూడి. క్యారెక్టర్ నచ్చడంతో లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు విజయశాంతి.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఓ హిలేరియస్ ట్రైన్ ఎపిసోడ్ షూట్ పూర్తిచేశారు. అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ షూట్ కంప్లీట్ అయింది. ఇవాళ్టి నుంచి విజయశాంతిపై షూటింగ్ మొదలైంది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే రామోజీ ఫిలింసిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెట్స్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో సినిమా రిలీజ్ అవుతుంది.