Liger - ఇండియా షేక్ అవుతుందంటున్న విజయ్

Thursday,July 21,2022 - 04:19 by Z_CLU

ఆగస్ట్ 25న ఇండియా షేక్ అవుతుందంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఈరోజు లైగర్ సినిమా ట్రయిలర్ ను లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్ లో తనదైన స్టయిల్ లో మాట్లాడాడు దేవరకొండ. తన గత సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ లైగర్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు థాంక్స్ చెప్పాడు.

“రెండేళ్లవుతుంది నా నుంచి సినిమా వచ్చి. ముందు రిలీజైన సినిమా పెద్ద చెప్పుకోదగ్గ మూవీ కూడా కాదు. అయినప్పటికీ లైగర్ ట్రయిలర్ కోసం, నా కోసం ఇంత వెయిట్ చేస్తున్న మీ అందరికీ ఐ లవ్ యు. ట్రయిలర్ లాంచ్ కే ఇంత రచ్చ చేస్తున్నారు. ఇంతకంటే డబుల్ రచ్చ సినిమా రిలీజ్ కు చేయాలి. ఆగస్ట్ 25న ఇలాంటి సెలబ్రేషన్ ప్రతి థియేటర్ లో జరగాలి.”

లైగర్ కు సంబంధించి ప్రచారం స్టార్ట్ చేయలేదంటూ ఇన్నాళ్లూ తన ఫ్యాన్స్ అల్లరి చేశారని, ఇప్పుడు ట్రయిలర్ లాంచ్ తో ప్రచారం ఊపందుకుందని చెప్పిన విజయ్.. బుల్లెట్ దిగిందా లేదా అని ఫ్యాన్స్ ను ప్రశ్నించాడు.

ఇదే ఈవెంట్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ కూడా మాట్లాడాడు. ఇండియన్ సినిమాలో రాబోయే రోజుల్లో విజయ్ దేవరకొండ అనే వ్యక్తి సూపర్ స్టార్ అవుతాడని జోస్యం చెప్పాడు. ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రానుంది లైగర్. అనన్య పాండే ఇందులో హీరోయిన్.