మరో 2 సినిమాలకు ఓకే చెప్పిన వెంకీ

Tuesday,December 27,2016 - 08:43 by Z_CLU

గురు సినిమా ఇలా పూర్తిచేశాడో లేదో అప్పుడే ఇంకో రెండు సినిమాలకు విక్టరీ వెంకటేశ్ ఓకే చెప్పాడు. త్వరలోనే నేను శైలజ ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్న వెంకీ… పూరి జగన్నాధ్, క్రిష్ డైరక్షన్ లో కూడా సినిమాలు చేసేందుకు సిద్ధమౌతున్నాడు. ప్రస్తుతం కిషోర్ తిరుమల సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చిన వెంటనే… క్రిష్, పూరి సినిమాలపై క్లారిటీ వచ్చేస్తుంది.
vnk0240
ప్రస్తుతం వెంకీ తన 75వ సినిమాకు దగ్గరవుతున్నాడు. ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడు. అయితే..తన 75వ మూవీని క్రిష్ కు అప్పగిస్తాడా… పూరీ జగన్నాధ్ చేతిలో పెడతాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. బాలయ్య నటిస్తున్న వందో సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. సో… వెంకీ కూడా తన 75వ సినిమాను క్రిష్ కే అప్పగించే అవకాశాలున్నాయని అంటున్నారు. పైగా వెంకీకి ఓ సోషియో ఫాంటసీ కథను వినిపించాడట క్రిష్. మరోవైపు పూరి జగన్నాధ్ కూడా వెంకటేష్ కు ఓ మంచి మాస్ మసాలా స్టోరీ వినిపించినట్టు టాక్. త్వరలోనే ఈ రెండు సినిమాలపై ఓ క్లారిటీ రానుంది.