Drishyam 2 - మరో రీమేక్ లాంచ్ చేసిన వెంకీ

Tuesday,March 02,2021 - 09:01 by Z_CLU

మలయాళంలో మోహన్ లాల్-జీతూ జోసెఫ్ కాంబోలో వచ్చిన దృశ్యం సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఆ సినిమాను అదే పేరుతో తెలుగులో వెంకీ రీమేక్ చేసి ఇక్కడ కూడా హిట్ కొట్టాడు. తాజాగా మోహన్ లాల్-జీతూ జోసెఫ్ కలిసి దృశ్యం-2తో మరోసారి హిట్ కొట్టారు. దీంతో వెంకీ కూడా అర్జెంట్ గా రంగంలోకి దిగిపోయాడు.

drishyam 2 telugu venkatesh

దృశ్యం-2 తెలుగు రీమేక్ ను వెంకటేష్ స్టార్ట్ చేశాడు. సురేష్ బాబు నిర్మాతగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈనెల 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు.

drishyam 2 telugu venkatesh

దృశ్యం సినిమాకు శ్రీప్రియను డైరక్టర్ గా తీసుకున్న వెంకీ.. దృశ్యం-2కు మాత్రం ఒరిజినల్ దర్శకుడు జీతూ జోసెఫ్ నే తీసుకున్నారు. తెలుగులో ఇతడికి ఇదే తొలి స్ట్రయిట్ మూవీ.

వెంకీ నటించిన నారప్ప సినిమా రిలీజ్ కు రెడీ అయింది. అటు ఎఫ్3 సినిమా కూడా ఆగస్ట్ 27న రిలీజ్ కాబోతోంది. దృశ్యం-2 కూడా ఇదే ఏడాది థియేటర్లలోకి తీసుకుకాబోతున్నారు. సో.. వెంకీ నుంచి ఈ ఏడాది 3 సినిమాలన్నమాట.

Also Check – నారప్ప అప్ డేట్స్