ప్రారంభమైన 'వీర భోగ వసంత రాయలు' సినిమా
Tuesday,June 06,2017 - 05:20 by Z_CLU
నారా రోహిత్-శ్రీ విష్ణు కాంబినేషన్ లో వచ్చిన ‘అప్పట్లో ఒకడుండే వాడు’ సినీప్రేక్షకులతో పాటు విమర్శకులని సైతం ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకున్న ఈ కాంబో మరో సారి ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు.
మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో నాన్ లీనియర్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘వీర భోగ వసంత రాయలు’ సినిమా లేటెస్ట్ గా రామెజిఫిల్మ్ సిటి లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. బాబా క్రియేషన్స్ పతాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్లన నిర్మిస్తున్న ఈ సినిమాతో ఇంద్రసేన.ఆర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక నారా రోహిత్-శ్రీ విష్ణు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో గ్లామర్ క్వీన్ శ్రియా శరణ్ మరో ముఖ్య పాత్రలో నటిస్తుండగా… సుధీర్బాబు ప్రత్యేఖ పాత్రలో నటిస్తున్నాడు. ఈరోజు మొదలైన షూటింగ్ లో సుధీర్బాబు, మిగతా నటుల పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు యూనిట్. అతి త్వరలో నారా రొహిత్, శ్రీవిష్ణు, శ్రియా ఈ షూటింగ్ పాల్గొననున్నారు..